కాంపౌండ్ పూల్లో మునిగి చిన్నారి మృతి
- April 24, 2019
దుబాయ్:మూడేళ్ళ బాలిక తాను నివసిస్తున్న రెసిడెన్షియల్ కాంపౌండ్లోనే వున్న స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయింది. అల్ బర్షాలో ఈ గటన చోటు చేసుకుంది. తన సోదరులు ఇద్దరూ స్కూల్కి వెళ్ళడంతో బాలిక, స్విమ్మింగ్ పూల్ వద్ద ఆడుకుంటూ వున్న సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే తండ్రి గెరార్డ్, ఇంట్లోనే వున్నారు ఘటన జరిగిన సమయంలో. పనిచేసుకుంటూ బిజీగా వున్న ఆయన ఒక్కసారిగా తన కూతురు కన్పించకపోవడంతో కలత చెందారు. అయితే, ఆమె నీటిలో మునిగిపోవడాన్ని గుర్తించి, వెంటనే బయటకు తీశారు. తక్షణం ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండాపోయింది. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని దుబాయ్ పోలీస్, తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







