ప్లిప్కార్ట్లో 50 వేల ఉద్యోగాలు..
- April 24, 2019
ఇ-కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ వ్యాపారాన్ని మరింత విస్తరింపజేస్తుంది. లాజిస్టిక్స్ రంగంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్లిప్కార్ట్. దీనిద్వారా 50,000ల ఉద్యోగాలకు రూపకల్పన జరుగుతుందని ఓ అంచనా. ఇప్పటికే ప్లిప్కార్ట్ని నడిపిస్తున్న వాల్మార్ట్ గురుగ్రామ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్లో లాజిస్టిక్స్ పార్క్స్ ఏర్పాటు కోసం 300 ఎకరాల భూమిని సేకరిస్తుంది. భారతదేశంలో ప్రధాన పోటీదారుగా ఉన్న అమెజాన్ను ఢీ కొట్టేందుకు ఈ ప్రణాళికలు ఉపయోగపడతాయని వాల్మార్ట్ భావిస్తోంది. ఈ లాజిస్టిక్ పార్కులు సరుకు రవాణా, పంపిణీ కేంద్రాలుగా పనిచేస్తాయి. ప్లిప్కార్ట్ చేపట్టిన నెక్ట్స్ 200 మిలియన్ కస్ట్మర్స్ ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరేందుకు ఈ కొత్త లాజిస్టిక్ పార్కులు తోడ్పడతాయని కంపెనీ అధికార వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







