శ్రీలంక పేలుళ్ళలో మరో భారతీయ వలసదారుడి మృతి
- April 25, 2019శ్రీలంకలో ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ళలో భారతదేశానికి చెందిన జునో శ్రీవాస్తవ ప్రాణాలు కోల్పోయినట్లు దుబాయ్లోని కాన్సుల్ జనరల్ విపుల్ వెల్లడించారు. జునో శ్రీవాస్తవ, దుబాయ్లో వుంటున్నారు. కొలంబోలోని సినామన్ గ్రాండ్ హోటల్లో జరిగిన పేలుళ్ళలో జునో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు విపుల్. ఘటన జరిగిన వెంటనే అతని సోదరుడు జుగ్ను, భార్య రచన కొలంబోకి వెళ్ళి, అక్కడ జునో మృతదేహాన్ని కనుగొన్నారు. జునో మృతదేహాన్ని ఇండియాకి తరలిస్తున్నారు. అల్ ఫుత్తైమ్ గ్రూప్లో ఐటీ మేనేజర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. జునో కుటుంబం ఉత్తర ప్రదేశ్ నుంచి వెళ్ళి ఉపాధి నిమిత్తం దుబాయ్లో వుంటోంది.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్