ఎండలు మండిపోతున్నాయి బాబోయ్
- April 28, 2019
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ..భగ లాడుతున్నాడు. రెండు రాష్ట్రాల్లోనూ సూరీడు చెలరేగిపోతున్నాడు. ఏపీలో అయితే ఓ వైపు వేడి.. ఉక్కపోత బెంబేలెత్తిస్తుంటే.. మరోవైపు దూసుకువస్తున్న ఫణి తుపాన్ మరింతగా భయపెడుతోంది. విశాల సముద్రతీరమున్న ఏపీలో ఎండలు మంటపుట్టిస్తున్నాయి. ఫణి తుపాన్ దూసుకువస్తున్నా.. ఉష్ణోగ్రతలు సెగలు పుట్టిస్తున్నాయి. దీంతో ఉదయం 10 గంటల తర్వాత రోడ్డెక్కాలంటేనే ప్రజలు ఠారెత్తిపోతున్నారు. ఇంటిపట్టున ఉన్నా ఉక్కపోతతో సతమతమవుతున్నారు. మధ్యాహ్నం మాత్రమే కాదు.. సాయంత్రం, రాత్రుల సయితం వేడి గాలుల ఉధృతి తగ్గడంలేదు. రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 112 ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని అంచనాలున్నాయి. ఆదివారం కూడా ఎండలు గట్టిగా కాస్తున్నాయి. తుపాన్ అతి సమీపంలోకి వస్తే తప్పా భానుడు శాంతించే పరిస్థితి లేదని విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







