ఎండలు మండిపోతున్నాయి బాబోయ్
- April 28, 2019
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ..భగ లాడుతున్నాడు. రెండు రాష్ట్రాల్లోనూ సూరీడు చెలరేగిపోతున్నాడు. ఏపీలో అయితే ఓ వైపు వేడి.. ఉక్కపోత బెంబేలెత్తిస్తుంటే.. మరోవైపు దూసుకువస్తున్న ఫణి తుపాన్ మరింతగా భయపెడుతోంది. విశాల సముద్రతీరమున్న ఏపీలో ఎండలు మంటపుట్టిస్తున్నాయి. ఫణి తుపాన్ దూసుకువస్తున్నా.. ఉష్ణోగ్రతలు సెగలు పుట్టిస్తున్నాయి. దీంతో ఉదయం 10 గంటల తర్వాత రోడ్డెక్కాలంటేనే ప్రజలు ఠారెత్తిపోతున్నారు. ఇంటిపట్టున ఉన్నా ఉక్కపోతతో సతమతమవుతున్నారు. మధ్యాహ్నం మాత్రమే కాదు.. సాయంత్రం, రాత్రుల సయితం వేడి గాలుల ఉధృతి తగ్గడంలేదు. రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 112 ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని అంచనాలున్నాయి. ఆదివారం కూడా ఎండలు గట్టిగా కాస్తున్నాయి. తుపాన్ అతి సమీపంలోకి వస్తే తప్పా భానుడు శాంతించే పరిస్థితి లేదని విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









