ఎండలు మండిపోతున్నాయి బాబోయ్
- April 28, 2019
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ..భగ లాడుతున్నాడు. రెండు రాష్ట్రాల్లోనూ సూరీడు చెలరేగిపోతున్నాడు. ఏపీలో అయితే ఓ వైపు వేడి.. ఉక్కపోత బెంబేలెత్తిస్తుంటే.. మరోవైపు దూసుకువస్తున్న ఫణి తుపాన్ మరింతగా భయపెడుతోంది. విశాల సముద్రతీరమున్న ఏపీలో ఎండలు మంటపుట్టిస్తున్నాయి. ఫణి తుపాన్ దూసుకువస్తున్నా.. ఉష్ణోగ్రతలు సెగలు పుట్టిస్తున్నాయి. దీంతో ఉదయం 10 గంటల తర్వాత రోడ్డెక్కాలంటేనే ప్రజలు ఠారెత్తిపోతున్నారు. ఇంటిపట్టున ఉన్నా ఉక్కపోతతో సతమతమవుతున్నారు. మధ్యాహ్నం మాత్రమే కాదు.. సాయంత్రం, రాత్రుల సయితం వేడి గాలుల ఉధృతి తగ్గడంలేదు. రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 112 ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని అంచనాలున్నాయి. ఆదివారం కూడా ఎండలు గట్టిగా కాస్తున్నాయి. తుపాన్ అతి సమీపంలోకి వస్తే తప్పా భానుడు శాంతించే పరిస్థితి లేదని విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







