పోలీసుల అదుపులో RGV
- April 28, 2019
ఎప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ తనడైన శైలిలో దూసుకుపోతుంటారు రామ్ గోపాల్ వర్మ. ఇటీవల ఆయన నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి గాను నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సినిమాను తెలంగాణలో విడుదల చేసినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్లో వాయిదా వేశారు. ఈ క్రమంలో కోర్టు ఒకే చెప్పడంతో మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా విడుదల చేయనున్నామని ప్రకటించారు వర్మ.
ఈ మేరకు నేడు (ఆదివారం సాయంత్రం) విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ప్రెస్మీట్ పెట్టాలని నిర్ణయించారు. అయితే హోటల్ యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో నడి రోడ్డుపైనే ప్రెస్మీట్ పెడతానంటూ సంచలన ప్రకటన చేశారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు వర్మ ప్రకటన మరి శృతిమించిందని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే కారణంగా రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







