పోలీసుల అదుపులో RGV
- April 28, 2019
ఎప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ తనడైన శైలిలో దూసుకుపోతుంటారు రామ్ గోపాల్ వర్మ. ఇటీవల ఆయన నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి గాను నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సినిమాను తెలంగాణలో విడుదల చేసినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్లో వాయిదా వేశారు. ఈ క్రమంలో కోర్టు ఒకే చెప్పడంతో మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా విడుదల చేయనున్నామని ప్రకటించారు వర్మ.
ఈ మేరకు నేడు (ఆదివారం సాయంత్రం) విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ప్రెస్మీట్ పెట్టాలని నిర్ణయించారు. అయితే హోటల్ యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో నడి రోడ్డుపైనే ప్రెస్మీట్ పెడతానంటూ సంచలన ప్రకటన చేశారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు వర్మ ప్రకటన మరి శృతిమించిందని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే కారణంగా రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









