'ఫోని' తుఫాన్ హెచ్చరికలు : ఎదుర్కొనేందుకు భారత్ ఆర్మీ రెడీ
- April 30, 2019
'ఫోని' తుఫాన్ హెచ్చరికలతో అధికారగణం సర్వం సిద్ధమయ్యింది. దీని ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో 'ఫోని' తుఫాన్ హెచ్చరికలతో ప్రజలకు సేవలందించేందుకు భారత సైన్యం సమాయత్తమైంది.
తుఫాన్ వల్ల భారీ వర్షాలతోపాటు వరదలు వెల్లువెత్తి, భారీ గాలులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరికలతో భారత నావికాదళం, భారత వైమానిక దళాలు అప్రమత్తమై తమ నౌకలు, హెలికాప్టర్లను సిద్ధం చేశాయి. తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణం తీరంలో ఐఎన్ఎస్ రాజాలీ నౌక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరంలో ఐఎన్ఎస్ డేగ నౌకలను కేంద్రం రంగంలోకి దించింది. తుఫాన్ బారిన పడిన ప్రజలను కాపాడేందుకు వీలుగా హెలికాప్టర్లను సైతం సిద్ధం చేశారు. తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు రబ్బరు పడవలు, పునరావాస పరికరాలు, ఆహార సామాగ్రిని సిద్ధంగా ఉంచారు. వైద్యానికి కావాల్సిన అన్ని రకాల చర్యల్ని సిద్ధం చేశారు. ఈ క్రమంలో డాక్టర్లతోపాటు కావాల్సిన మెడిసిన్స్ ఔషధాలను కూడా భారత సైన్యం సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









