కన్ఫర్మ్: మహేశ్ కోసం వెంకీ, విజయ్ దేవరకొండ రెడీ

- May 01, 2019 , by Maagulf
కన్ఫర్మ్: మహేశ్ కోసం వెంకీ, విజయ్ దేవరకొండ రెడీ

మహేశ్ బాబు 25వ చిత్రం'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగనుంది. హైదరాబాద్‌లోని నెక్లస్‌రోడ్‌లో ఈ కార్యక్రమం జరగనుండగా.. దీనికి ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేశ్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ రానున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కోసం వెంకటేశ్, మహేశ్ బాబు తొలిసారిగా కలిసి నటించగా.. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో గతంలో మహేశ్ నటించిన 'శ్రీమంతుడు' ఆడియో ఫంక్షన్‌కు కూడా వెంకటేశ్ చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. కాగా మరోవైపు విజయ్ దేవరకొండ ఇప్పటివరకు చిన్న హీరోల ఫంక్షన్‌లకు అతిథిగా రాగా.. తొలిసారిగా ఓ పెద్ద స్టార్ నటుడికి గెస్ట్‌గా మారడం విశేషం.

కాగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన 'మహర్షి' చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. దిల్ రాజ్, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మహేశ్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం కావడం, ఇప్పటికే రిలీజైన టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో 'మహర్షి'పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com