ఇండియాకి ప్రాణంతోనే వెళ్ళాలి.. శవంగా కాదు!
- May 02, 2019
బహ్రెయిన్: 80 ఏళ్ళ వలసదారుడొకరు బహ్రెయిన్ కింగ్డమ్లో వివిధ కారణాలతో ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. కోర్టు కేసులు, లోన్లు సహా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి స్వదేశానికి సజీవంగా వెళ్ళాలన్న ఆవేదనతో వున్నారు. కేరళకు చెందిన నలరాజన్ దుస్థితి ఇది. ఒకప్పుడు ప్రముఖ బిజినెస్మెన్గా బహ్రెయిన్లో నలరాజన్ వ్యవహరించారు. వెస్ట్ ఎకెర్లో ఆయనకు ఓ బేకరీ షాప్ వుండేది. పదేళ్ళ క్రితం నష్టాలతో అప్పులు చేయాల్సి వచ్చిందనీ, వాటి వడ్డీల కారణంగా తన జీవితం ఇబ్బందుల్లో పడిందని చెప్పారు నలరాజన్. నలరాజన్ అప్పులు సుమారుగా 40,000 బహ్రెయినీ దినార్స్గా వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియన్ ఎంబసీ ఇచ్చే 30 బహ్రెయినీ దినార్స్ గ్రాంట్తోనే జీవితం గడుపుతున్నట్లు చెప్పారు. 'సజీవంగా నేను స్వదేశానికి వెళ్ళాళి.. శవంగా మారి శవపేటికలో వెళ్ళాలనుకోవడంలేదు' అని నలరాజన్ చెబుతున్న మాటలు వినేవారికి కంటతడి పెట్టిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







