దుబాయ్ వాహనదారులకు రమదాన్ వార్నింగ్
- May 06, 2019
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆతృతతో వాహనాల్ని వేగంగా నడపరాదని దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలనీ, తద్వారా రమదాన్ మరింత ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. దుబాయ్ పోలీస్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, రమదాన్ మాసంలో ప్రత్యేకంగా పోలీసులు ట్రాఫిక్ విషయమై జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ, దుబాయ్ రెసిడెంట్స్, పోలీసులకు సహకరించాలనీ కోరారు. ముఖ్యంగా మాస్క్ల ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. రోడ్ సేఫ్టీ నిబంధనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిద్ధంగా వుంటారని ఆయన పేర్కొన్నారు. పోలీస్ పెట్రోల్స్, మోటరిస్టులకు ఇఫ్తార్ మీల్స్ అందిస్తారని కూడా వివరించారాయన. వాహనాల పార్కింగ్ విషయంలో కూడా వాహనదారులు నిబంధనలు పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







