దుబాయ్ వాహనదారులకు రమదాన్ వార్నింగ్
- May 06, 2019
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆతృతతో వాహనాల్ని వేగంగా నడపరాదని దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలనీ, తద్వారా రమదాన్ మరింత ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. దుబాయ్ పోలీస్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, రమదాన్ మాసంలో ప్రత్యేకంగా పోలీసులు ట్రాఫిక్ విషయమై జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ, దుబాయ్ రెసిడెంట్స్, పోలీసులకు సహకరించాలనీ కోరారు. ముఖ్యంగా మాస్క్ల ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. రోడ్ సేఫ్టీ నిబంధనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిద్ధంగా వుంటారని ఆయన పేర్కొన్నారు. పోలీస్ పెట్రోల్స్, మోటరిస్టులకు ఇఫ్తార్ మీల్స్ అందిస్తారని కూడా వివరించారాయన. వాహనాల పార్కింగ్ విషయంలో కూడా వాహనదారులు నిబంధనలు పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..







