దుబాయ్ వాహనదారులకు రమదాన్ వార్నింగ్
- May 06, 2019
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆతృతతో వాహనాల్ని వేగంగా నడపరాదని దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలనీ, తద్వారా రమదాన్ మరింత ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. దుబాయ్ పోలీస్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, రమదాన్ మాసంలో ప్రత్యేకంగా పోలీసులు ట్రాఫిక్ విషయమై జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ, దుబాయ్ రెసిడెంట్స్, పోలీసులకు సహకరించాలనీ కోరారు. ముఖ్యంగా మాస్క్ల ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. రోడ్ సేఫ్టీ నిబంధనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిద్ధంగా వుంటారని ఆయన పేర్కొన్నారు. పోలీస్ పెట్రోల్స్, మోటరిస్టులకు ఇఫ్తార్ మీల్స్ అందిస్తారని కూడా వివరించారాయన. వాహనాల పార్కింగ్ విషయంలో కూడా వాహనదారులు నిబంధనలు పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







