దుబాయ్ వాహనదారులకు రమదాన్ వార్నింగ్
- May 06, 2019దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆతృతతో వాహనాల్ని వేగంగా నడపరాదని దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలనీ, తద్వారా రమదాన్ మరింత ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. దుబాయ్ పోలీస్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, రమదాన్ మాసంలో ప్రత్యేకంగా పోలీసులు ట్రాఫిక్ విషయమై జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ, దుబాయ్ రెసిడెంట్స్, పోలీసులకు సహకరించాలనీ కోరారు. ముఖ్యంగా మాస్క్ల ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. రోడ్ సేఫ్టీ నిబంధనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిద్ధంగా వుంటారని ఆయన పేర్కొన్నారు. పోలీస్ పెట్రోల్స్, మోటరిస్టులకు ఇఫ్తార్ మీల్స్ అందిస్తారని కూడా వివరించారాయన. వాహనాల పార్కింగ్ విషయంలో కూడా వాహనదారులు నిబంధనలు పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ