యూఏఈలో మాస్క్‌ నిర్మించిన ఇండియన్ క్రిస్టియన్‌

- May 08, 2019 , by Maagulf
యూఏఈలో మాస్క్‌ నిర్మించిన ఇండియన్ క్రిస్టియన్‌

భారతీయ వ్యాపారవేత్త, యూఏఈ క్రిస్టియన్‌ వలసదారుడు సాజి చెరియన్‌ పవిత్ర రమదాన్‌ మాసం సందర్భంగా ఫుజారియాలో 700కి పైగా ఇఫ్తార్‌ మీల్స్‌ని కార్మికులకు అందిస్తున్నారు. చెరియన్‌, మరియమ్‌ ఉమ్‌ ఇసా (మేరీ ద మదర్‌ ఆఫ్‌ జీసస్‌) మాస్క్‌ని అల్‌ హైల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో గత ఏడాది నిర్మించారు. ఎమిరేట్‌లోని వేలాది మంది కార్మికుల కోసం ఈ మసీదుని నిర్మించారాయన. మాస్క్‌ని నిర్మించడానికి ముందు సిరియన్‌, ఇఫ్తార్‌ టెంట్స్‌కి వెళ్ళి ఫుడ్‌ని కార్మికులకు అందించేవారు. ఆ తర్వాత ఆయన మాస్క్‌ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. జనరల్‌ అథారిటీ ఫర్‌ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ని సందర్శించి అవసరమైన అనుమతులు తీసుకుని మాస్క్‌ నిర్మాణం చేపట్టారు. 2003లో కేవలం 630 దిర్హామ్‌లతో దుబాయ్‌లో అడుగు పెట్టిన చెరియన్‌, కన్‌స్ట్రక్షన్‌ వర్కర్‌గా కెరీర్‌ ప్రారంభించి, ఆ తర్వాత కాంట్రాక్టర్‌గా ఎదిగి, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌గానూ మారారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com