యూఏఈలో పశ్చిమగోదావరి జిల్లా వాసి మృతి

- May 10, 2019 , by Maagulf
యూఏఈలో పశ్చిమగోదావరి జిల్లా వాసి మృతి

యూఏఈ:యూఏఈలో పశ్చిమగోదావరి జిల్లా వాసి చిలకలపూడి రామకృష్ణ మృతి చెందారు. ఉపాధి నిమిత్తం యూఏఈకి వచ్చిన రామకృష్ణ, ఏడాదిపాటు ఓ క్లీనింగ్‌ కంపెనీలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత అబ్‌స్కాండ్‌ అయిన రామకృష్ణ, అనారోగ్యంతో అల్‌ ఖాసిమిలో చేరినట్లు తెలుస్తోంది. హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతూ వైద్య చికిత్స పొందిన రామకృష్ణ, దురదృష్టవశాత్తూ హార్ట్‌ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు APNRT కో-ఆర్డినేటర్స్ వాసు,విశ్వేశ్వర రావు,ఖాదర్ బాషా మరికొందరు తీవ్రంగా కృషి చేశారు. వీరికి APNRT తోడ్పాటు కూడా అందించడం జరిగింది. మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోగల నిడదవోలుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com