బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి 8 మంది మృతి..

- May 10, 2019 , by Maagulf
బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి 8 మంది మృతి..

బాగ్దాద్‌:ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని ఓ మార్కెట్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. జమీలా మార్కెట్‌లో సంభవించిన దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా.. 15 మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలతో ఏర్పాటు చేసిన బెల్టు ధరించిన దుండగుడు అత్యంత రద్దీగా ఉండే జమీలా మార్కెట్‌లో తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు అధికారులు చెప్పారు. రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ తిరుగుబాటు దారులు దాడులకు పాల్పడుతున్నారని అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com