యూఏఈలో భారత వలసదారులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేసిన ఎంబసీ
- May 11, 2019అబుధాబి:యూఏఈలోని ఇండియన్ ఎంబసీ, తమ పౌరులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. చేసిన పనికి జీతం దక్కని పక్షంలో, ఎంబసీని సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లీషుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ ఈ ప్రకటనను విడుదల చేశారు. జీతాలు దక్కని కారణంగా భారతీయ వలసదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, ఇలాంటి వారు ఎక్కువగా పలు కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెబుతున్న అధికారులు, ఎంబసీని సంప్రదిస్తే, తగు న్యాయం జరగడానికి చర్యలు తీసుకుంటామనీ, రిటర్న్ టిక్కెట్లు ఇచ్చి స్వదేశానికి పంపడం ద్వారా ఇబ్బందుల్లో వున్నవారి సమస్యలు కొంతవరకు తగ్గుతాయని అంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా భారత వలసదారుల్లో చైతన్యం కల్పించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు