ఒమన్లో గాయపడ్డ కార్మికుడికి ఇండియన్ ఎంబసీ సాయం
- May 17, 2019మస్కట్: ఒమన్లో గాయపడ్డ భారతీయ వలస కార్మికుడికి సాయం అందించేందుకు ఒమన్లోని ఇండియన్ ఎంబసీ ముందుకొచ్చింది. ఒమన్ హాస్పిటల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న రాజేంద్రప్రసాద్కి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది ఇండియన్ ఎంబసీ. అలాగే, ప్రసాద్కి సాయం అందించేందుకు ఇండియన్ కమ్యూనిటీకి చెందిన సోషల్ మరియు వెల్ఫేర్ వర్కర్స్ సాయం చేయాలని కోరింది. ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇండియన్ కమ్యూనిటీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామనీ, ఆయనకు సహాయం అందించేందుకు సిద్ధంగా వున్నామని చెప్పారు. రాజేంద్రప్రసాద్కి ఇప్పటికే కొన్ని శస్త్ర చికిత్సలు జరిగాయనీ, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- వరంగల్ విమానాశ్రయం పై కదలిక
- ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్