దుబాయ్లో ముగ్గురు స్కామర్స్ అరెస్ట్
- May 21, 2019ముగ్గురు సభ్యులుగల స్కామర్స్ ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ముందుంచారు. అక్రమంగా వందలాది సిమ్ కార్డుల్ని జారీ చేసినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. అరెస్టయినవారిలో ఒకరు మొబైల్ ఓనర్. వినియోగదారుడి అనుమతి లేకుండా, అతని పేరు మీద సిమ్కార్డ్స్ని నిందితుడు జారీ చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసులో సాక్షి ఓ ఆఫ్రికన్ వర్కర్. సిమ్ కార్డ్ కోసం తాను ఓ షాప్కి వెళ్ళగా, అక్కడ తనకు సిమ్కార్డ్ లభ్యం కాలేదనీ, ఆ తర్వాత ఆరా తీస్తే, తన పేరు మీద తనకు తెలియకుండా సిమ్కార్డులు జారీ అయినట్లు తేలిందని బాధితుడు చెప్పారు. ఇలాంటి స్కామ్ ద్వారా పలు స్కామ్స్కి నిందితులు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో ఇతరుల నుండి డబ్బులు గుంజుతున్నట్లు తేల్చిన పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందుంచడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..