ఇంగ్లండ్ బయలుదేరిన కోహ్లిసేన
- May 22, 2019ముంబై: ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టు లండన్కు పయనమైంది. బుధవారం తెల్లవారుఝామున ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కోహ్లిసేన ఇంగ్లాండ్కు పయనమైంది. కోహ్లి, ధోని సహా ఇతర ఆటగాళ్లు అధికార దుస్తుల్లో విమానాశ్రయంలో ఉన్న ఫోటోలను బిసిసిఐ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్లు బుమ్రా, చాహల్, హార్థిక్ పాండ్యా కూడా ఫోటోలు ట్వీట్ చేశారు.
మొదటగా జూన్5న దక్షిణాఫ్రికాతో మ్యాచ్తో భారత్ తన ప్రయాణం మొదటుపెట్టనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్, బంగ్లాదేశ్లో కోహ్లిసేన రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. ఇంగ్లాండ్ బయలుదేరే ముందు కోహ్లి, రవిశాస్త్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా ఇది తనకు అత్యంత సవాలుతో కూడుకున్న ప్రపంచకప్ అనిపిస్తుంది.
ఏ జట్టు ఏ జట్టుకైనా షాకివ్వచ్చు, ఫార్మాట్ ఇంతకుముందులా లేదు కాబట్టి ప్రతి మ్యాచ్లో ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే. ఇదో భిన్నమైన సవాల్, దీనికి ఎంత వేగంగా అలవాటు పడతామన్నది కీలకం అని కోహ్లి అన్నారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…