ఈనెల 30న ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం
- May 23, 2019ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయం దిశగా దూసుకెళుతుండడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఎల్లుండి వైసీపీ శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో జగన్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు గెలిచిన ఎమ్మెల్యేలు. అలాగే ఈనెల 30న జగన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ స్పష్టమైన మెజారిటీ దిశగా వెళుతున్నట్టు కనిపించడంతో తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద కార్యకర్తల కోలాహలం నెలకొంది. ఫలితాలు చూస్తున్న జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డిని ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో వైసీపీ అధినేత జగన్ విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఫోన్ చేశారు. దీంతో స్వామిజి జగన్ ను అభినందనించారు. ఫలితాలపై ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు జగన్.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు