5జి నెట్వర్క్: ఎటిసలాట్ తొలి మెనా నెట్వర్క్
- May 30, 2019యూ.ఏ.ఈ:ఎట్టకేలకు యూఏఈలో 5జి సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. టెలికామ్ ఆపరేటర్ ఎటిసలాట్, ఇకపై యూఏఈలో వినియోగదారులు 5జి నెట్వర్క్ని పొందవచ్చునని ప్రకటించింది. ఎలాంటి అదనపు ఛార్జీలూ లేకుండా 5జి రెడీ జెడ్టిఇ యాక్సన్ 10 ప్రో ద్వారా ఈ కొత్త అనుభూతిని పొందడానికి వీలుంది. 4జితో పోల్చితే 20 రెట్లు వేగంతో 5జి సేవలు వినియోగదారులకు గొప్ప అనుభూతినివ్వనున్నాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అత్యంత వేగంతో కూడిన నెట్వర్క్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎటిసలాట్ పేర్కొంది. యాక్సాన్ 10 ప్రో కొనుగోలు కోసం మూడు ఆప్షన్స్ని ఎటిసలాట్ వినియోగదారుల ముందుంచింది. వీటిల్లో స్ట్రెయిట్ పేమెంట్ కింద 5,555 దిర్హామ్లు చెల్లించవచ్చు. అలాగే, 12, 18, 24 నెలల ఇన్స్టాల్మెంట్స్ ప్రాతిపదికన 473, 318, 241 దిర్హామ్లు చెల్లించడానికీ అవకాశం కల్పిస్తున్నారు. పోస్ట్పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్తో తీరనున్న అనుబంధం..
- TGSRTC ప్రయాణికులకు శుభవార్త...
- ఏపీలో కూటమిదే అధికారం..పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
- టీ20 వరల్డ్ కప్ మ్యాచ్.. రేపటి నుంచే ప్రారంభం..
- ఈద్ అల్ అదా.. బలి జంతువుల ధరలు తగ్గుతాయా?
- ఫర్వానియాలో పార్క్ చేసిన వాహనాలు దగ్ధం
- Dh4,400 ఆదా.. 3-రోజుల సూపర్ సేల్..!
- 'రోజుకు Dh800 సంపాదించండి': వాట్సాప్ స్కామర్లపై హెచ్చరిక
- బౌషర్లో కార్మికుడు మృతి
- సెంట్రల్ జెడ్డాలో కుప్పకూలిన 5 అంతస్థుల భవనం