అమెరికా వీసా కావాలంటే సోషల్ మీడియా వివరాలు ఇవ్వాల్సిందే
- June 02, 2019వాషింగ్టన్:వీసాల జారీ విషయంలో అమెరికా మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసే వారు తమ సామాజిక మాధ్యమాల వివరాలు కూడా జత చేసేలా కొత్తనియమాలను తీసుకొచ్చింది. నిజానికి ఈ నియమం గురించి గతేడాదే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ప్రజాభిప్రాయం సేకరించి ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ నియమం ఏడాదికి 14.7 మిలియన్ల మందిపై ప్రభావం చూపనుంది. అయితే ఈ నియమం నుంచి ద్వైపాక్షిక, అధికారిక వీసాదార్లకు మినహాయింపు ఉంటుంది. ఉద్యోగం, విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే వారు మాత్రం తప్పని సరిగా సోషల్ మీడియా వివరాలు వెల్లడించాల్సిందే.
కొత్త నిబంధలన ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు సామాజిక మాధ్యమాలను వారు ఏ పేరు మీద ఉపయోగిస్తున్నారో వెల్లడించాలి. దీంతో పాటు ఐదేళ్లపాటు ఈమెయిల్ ఐడీ రిపోర్టు కూడా ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన వారి అభ్యర్థనను తిరస్కరించడమే కాకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఇంతకు ముందు నిబంధనల ప్రకారం వీసా అభ్యర్థులకు ఉగ్ర ముఠాలతో సంబంధాలున్నాయా అనే కోణంలో మాత్రమే విచారణ చేపట్టేవారు. ఇప్పుడు నిజమైన అభ్యర్థులను గుర్తించేందుకు సోషల్ మీడియా ఖాతాల ఆధారంగానూ విచారణ చేపడతారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల