విజయవాడ నుంచి సింగపూర్ ఇండిగో విమాన సర్వీసులు ఆగిపోతాయా?!కారణాలేంటి?
- June 10, 2019
విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇక గ్రౌండ్ కే పరిమితం కానున్నాయా? జులై 2 నుంచి ఇండిగో సర్వీసులు ఆగిపోతాయా. సాంకేతిక కారణాలతో సర్వీసులు రద్దు చేస్తారా.. ఇంకేదైనా కారణాలున్నాయా అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. రిజర్వేషన్ కోసం ప్రయాణీకులు ప్రయత్నిస్తుండగా.. జులై 2 తర్వాత సీట్లు చూపించడం లేదు. విజయవాడ నుంచి ఇండిగో సంస్థ 180 సీటర్ విమానాలు సింగపూర్ కు రోజూ నడిపిస్తోంది. ప్రస్తుతం ఎయిర్లైన్స్ వ్యాపారంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సర్వీసులు ఆపడం మేలని భావించినట్టు ఎయిర్ పోర్ట్ వర్గాలంటున్నాయి. కనీసం 265 సీట్లు నిండితేనే కంపెనీకి నష్టం రాకుండా ఉంటుందని ఆ రంగ నిఫుణులు అంటున్నారు. కానీ మినిమం అక్యుపెన్సీ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని సంబంధిత ఎయిర్ లైన్స్ లేదంటే పౌరవిమానయాన సంస్థ కన్ఫామ్ చేయాల్సి ఉంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







