విజయవాడ నుంచి సింగపూర్ ఇండిగో విమాన సర్వీసులు ఆగిపోతాయా?!కారణాలేంటి?
- June 10, 2019
విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇక గ్రౌండ్ కే పరిమితం కానున్నాయా? జులై 2 నుంచి ఇండిగో సర్వీసులు ఆగిపోతాయా. సాంకేతిక కారణాలతో సర్వీసులు రద్దు చేస్తారా.. ఇంకేదైనా కారణాలున్నాయా అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. రిజర్వేషన్ కోసం ప్రయాణీకులు ప్రయత్నిస్తుండగా.. జులై 2 తర్వాత సీట్లు చూపించడం లేదు. విజయవాడ నుంచి ఇండిగో సంస్థ 180 సీటర్ విమానాలు సింగపూర్ కు రోజూ నడిపిస్తోంది. ప్రస్తుతం ఎయిర్లైన్స్ వ్యాపారంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సర్వీసులు ఆపడం మేలని భావించినట్టు ఎయిర్ పోర్ట్ వర్గాలంటున్నాయి. కనీసం 265 సీట్లు నిండితేనే కంపెనీకి నష్టం రాకుండా ఉంటుందని ఆ రంగ నిఫుణులు అంటున్నారు. కానీ మినిమం అక్యుపెన్సీ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని సంబంధిత ఎయిర్ లైన్స్ లేదంటే పౌరవిమానయాన సంస్థ కన్ఫామ్ చేయాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







