విజయవాడ నుంచి సింగపూర్ ఇండిగో విమాన సర్వీసులు ఆగిపోతాయా?!కారణాలేంటి?
- June 10, 2019
విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇక గ్రౌండ్ కే పరిమితం కానున్నాయా? జులై 2 నుంచి ఇండిగో సర్వీసులు ఆగిపోతాయా. సాంకేతిక కారణాలతో సర్వీసులు రద్దు చేస్తారా.. ఇంకేదైనా కారణాలున్నాయా అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. రిజర్వేషన్ కోసం ప్రయాణీకులు ప్రయత్నిస్తుండగా.. జులై 2 తర్వాత సీట్లు చూపించడం లేదు. విజయవాడ నుంచి ఇండిగో సంస్థ 180 సీటర్ విమానాలు సింగపూర్ కు రోజూ నడిపిస్తోంది. ప్రస్తుతం ఎయిర్లైన్స్ వ్యాపారంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సర్వీసులు ఆపడం మేలని భావించినట్టు ఎయిర్ పోర్ట్ వర్గాలంటున్నాయి. కనీసం 265 సీట్లు నిండితేనే కంపెనీకి నష్టం రాకుండా ఉంటుందని ఆ రంగ నిఫుణులు అంటున్నారు. కానీ మినిమం అక్యుపెన్సీ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని సంబంధిత ఎయిర్ లైన్స్ లేదంటే పౌరవిమానయాన సంస్థ కన్ఫామ్ చేయాల్సి ఉంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









