అణచివేతకు వ్యతిరేకంగా సూడాన్లో ఉద్యమం ఉదృతం..ఘర్షణల్లో ముగ్గురు మృతి
- June 11, 2019
ఖర్తోమ్ : సూడాన్లో మిలటరీ ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత చర్యలను నిరసిస్తూ ప్రతిపక్షాల నేతృత్వంలోని పలు సంఘాలు ఆది వారం సహాయ నిరాకరణను పాటించాయి. మిలటరీ ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ సమ్మె ప్రారంభించాయి. మిలటరీ ప్రభుత్వ అణిచివేత చర్యల్లో 100 మందికిపైగా మృతి చెందడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సమ్మె సందర్భంగా భద్రతా బలగాలతో ఆదివారం జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మరణించారని డాక్టర్స్ కమిటీ తెలిపింది. దీంతో ఇటీవల కాలంలో సైన్యం చేపట్టిన అణిచివేత చర్యలో మరణించిన వారి సంఖ్య 117కు చేరుకుంది. మిలటరీ ప్రభుత్వం మాత్రం మృతుల సంఖ్యను 60గా చెబుతూ తగ్గించి చూపే ప్రయత్నం చేసింది. దేశంలో పౌర ప్రభుత్వం ఏర్పడే వరకు సూడాన్ నుండి రాకపోకలను రద్దు చేయాలని ఆఫ్రికన్ యూనియన్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో రాజకీయ, సామాజిక వాతావ రణం క్షీణించింది. సూడాన్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఎస్పిఎ) ఈ సందర్భంగా ఒక ప్రకటన చేస్తూ శాంతి యుతంగా సమ్మె చేస్తూ ప్రతిఘటించడమే అధికారంలో ఉన్న మిలటరీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సరైన మార్గమని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్లో సూడాన్ అధ్యక్షుడు ఒమర్ హసన్ అల్ బషీర్ రాజీనామా చేసిన నాటి నుండి దేశంలో మిలటరీ పాలన కొనసాగు తున్న సంగతి తెలిసిందే. సైనికుల అణచివేత చర్యల కారణంగా జీవించే హక్కును పరిరక్షించుకోవలసిన అవసరముందని ఎస్పిఎ తన ప్రకటనలో పేర్కొంది.
ఐరాస ఖండన
సూడాన్లో హింసాత్మక చర్యలను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. సూడాన్ పౌరులపై బలప్రయోగాన్ని ఆయన నిరసించారు. పలువురు మృతికి, గాయపడటానికి కారణమైన సైనిక చర్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







