మోడీ అడుగుజాడల్లో పాక్ ప్రధాని
- June 13, 2019ఇస్లామాబాద్: అక్రమాలు, అవినీతికి పాల్పడే వారిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొరడా ఝుళపించనున్నారు. అలాంటివాళ్ల వల్ల దేశానికి అపార నష్టం వాటిల్లడమే కాకుండా ,దేశంలోని ప్రజలు పేదరికంలోకి వెళ్లాల్సి వచ్చిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వాలు దశాబ్ద కాలంలో రూ 24 లక్షల కోట్ల విలువైన రుణాలు ఎలా తీసుకున్నాయో.. తద్వారా దేశం ఎలా దివాళా తీసిందో తేల్చేందుకు తన సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమీషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రజాస్వామ్యం మాటున ఆశ్రయం కోరే ఇలాంటి శక్తులకు ఎలాంటి ప్రోటోకాల్ పాటించబోమని ఇమ్రాన్ స్పష్టం చేశారు. పంజాబ్ ప్రావిన్స్ ప్రతిపక్ష నేత హజ్మా షాహబాజ్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తదితరుల అరెస్టు నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?