మోడీ అడుగుజాడల్లో పాక్ ప్రధాని
- June 13, 2019
ఇస్లామాబాద్: అక్రమాలు, అవినీతికి పాల్పడే వారిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొరడా ఝుళపించనున్నారు. అలాంటివాళ్ల వల్ల దేశానికి అపార నష్టం వాటిల్లడమే కాకుండా ,దేశంలోని ప్రజలు పేదరికంలోకి వెళ్లాల్సి వచ్చిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వాలు దశాబ్ద కాలంలో రూ 24 లక్షల కోట్ల విలువైన రుణాలు ఎలా తీసుకున్నాయో.. తద్వారా దేశం ఎలా దివాళా తీసిందో తేల్చేందుకు తన సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమీషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రజాస్వామ్యం మాటున ఆశ్రయం కోరే ఇలాంటి శక్తులకు ఎలాంటి ప్రోటోకాల్ పాటించబోమని ఇమ్రాన్ స్పష్టం చేశారు. పంజాబ్ ప్రావిన్స్ ప్రతిపక్ష నేత హజ్మా షాహబాజ్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తదితరుల అరెస్టు నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..









