మోడీ అడుగుజాడల్లో పాక్ ప్రధాని
- June 13, 2019
ఇస్లామాబాద్: అక్రమాలు, అవినీతికి పాల్పడే వారిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొరడా ఝుళపించనున్నారు. అలాంటివాళ్ల వల్ల దేశానికి అపార నష్టం వాటిల్లడమే కాకుండా ,దేశంలోని ప్రజలు పేదరికంలోకి వెళ్లాల్సి వచ్చిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వాలు దశాబ్ద కాలంలో రూ 24 లక్షల కోట్ల విలువైన రుణాలు ఎలా తీసుకున్నాయో.. తద్వారా దేశం ఎలా దివాళా తీసిందో తేల్చేందుకు తన సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమీషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రజాస్వామ్యం మాటున ఆశ్రయం కోరే ఇలాంటి శక్తులకు ఎలాంటి ప్రోటోకాల్ పాటించబోమని ఇమ్రాన్ స్పష్టం చేశారు. పంజాబ్ ప్రావిన్స్ ప్రతిపక్ష నేత హజ్మా షాహబాజ్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తదితరుల అరెస్టు నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







