సోమాలియా పై పంజా విసిరిన ఉగ్రవాదులు: 11 మంది మృతి

- June 16, 2019 , by Maagulf
సోమాలియా పై పంజా విసిరిన ఉగ్రవాదులు: 11 మంది మృతి

వరుస బాంబు పేలుళ్లతో సోమాలియా దద్దరిల్లింది. సోమాలియా దేశ రాజధాని మొగదీషులోని అధ్యక్ష భవనంతోపాటు మరో చోట సంభవించిన కారుబాంబు పేలుళ్లలో 11 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయలయ్యాయి. మొదటి పేలుడు అధ్యక్ష భవనం సమీపంలోని తనిఖీ కేంద్రం దగ్గర జరిగిందని.. తొమ్మిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.

రెండో పేలుడు ఘటన ఫోర్ట్‌ఫీల్డ్‌ విమానాశ్రయం సమీపంలోని తనిఖీ కేంద్రం దగ్గర సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్‌ సహా మరో వ్యక్తి దుర్మరణం చెందారు. బాంబు పేలుళ్లకు అల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థగా అల్‌ షబాబ్‌ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.

2017 అక్టోబర్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు అల్‌ షబాబ్‌ సంస్థే కారణం. ఆ ఘటనలో 500 మందికి పైగా మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com