సోమాలియా పై పంజా విసిరిన ఉగ్రవాదులు: 11 మంది మృతి
- June 16, 2019
వరుస బాంబు పేలుళ్లతో సోమాలియా దద్దరిల్లింది. సోమాలియా దేశ రాజధాని మొగదీషులోని అధ్యక్ష భవనంతోపాటు మరో చోట సంభవించిన కారుబాంబు పేలుళ్లలో 11 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయలయ్యాయి. మొదటి పేలుడు అధ్యక్ష భవనం సమీపంలోని తనిఖీ కేంద్రం దగ్గర జరిగిందని.. తొమ్మిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
రెండో పేలుడు ఘటన ఫోర్ట్ఫీల్డ్ విమానాశ్రయం సమీపంలోని తనిఖీ కేంద్రం దగ్గర సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరో వ్యక్తి దుర్మరణం చెందారు. బాంబు పేలుళ్లకు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థగా అల్ షబాబ్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
2017 అక్టోబర్లో జరిగిన బాంబు పేలుళ్లకు అల్ షబాబ్ సంస్థే కారణం. ఆ ఘటనలో 500 మందికి పైగా మృతి చెందారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







