జనవరి 1 నుంచి మారిన హైరింగ్ నిబంధనలివే
- January 04, 2016
విదేశి కార్మికుల్ని రిక్రూట్ చేసుకోవడానికి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. రెండేళ్ళ వర్క్ వీసా మూడు దశల్లో మంజూరు చేయబడ్తుంది. యజమాని ముందుగా ఎంతమంది కార్మికులను నియమించుకుంటున్నారనే అంశాలతోపాటు, ఆఫర్ లెటర్ని, నిబంధనలకు అనుగుణంగా తస్హీల్ సర్వీస్ సెంటర్స్ లేదా స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ 'మోలాప్' ద్వారా అందజేయవలసి ఉంటుంది. ఆ తర్వాత యజమాని, కార్మికులకు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్తో కూడిన జాబ్ ఆఫర్ లెటర్ని పంపవలసి ఉంటుంది. సైన్ చేయడం లేదా ఫింగర్ ప్రింట్ చేయడం ద్వారా మాత్రమే జాబ్ లెటర్ పంపాలి. ఆఫర్ లెటర్, అరబిక్ మరియు ఇంగ్లీషుతోపాటు కార్మికుడికి అర్థమయ్యే థర్డ్ లాంగ్వేజ్ (మినిస్ట్రీ వెబ్సైట్లో పేర్కొనబడినవి మాత్రమే) లో ఉండాలి. మినిస్ట్రీ వెబ్సైట్ ద్వారా కార్మికులు వర్క్ కాంట్రాక్ట్ని రివ్యూ చేసుకోవచ్చు. పాస్పోర్ట్ నంబర్, నేషనాలిటీ మరియు ట్రాన్సాక్షన్ నంబర్ ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు. వర్క్ పర్మిట్ ఎక్స్ట్రాక్షన్ స్టేజ్లో యజమాని, వర్కర్ సంతకం చేసిన లెటర్ని ఇనీషియల్ అప్రూవ్ కోసం సమర్పించవలసి ఉంటుంది. మినిస్ట్రీ అన్నీ పరిశీలించి, అంతా సక్రమంగా వుంటే వర్క్ పర్మిట్కు అనుమతిస్తుంది.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







