వరల్డ్లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా మోదీ..!
- June 21, 2019
భారత ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలిచారు. బ్రిటీష్ హెరాల్డ్ సంస్థ నిర్వహించిన ఓటింగ్లో 2019లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఓటేశారు.
లండన్కు చెందిన బ్రిటిష్ మేగజైన్ నిర్వహించిన ఈ రీడర్స్ పోల్ లో భారత ప్రధాని మోదీ 30.9శాతం ఓట్లతో గెలిచారు. రష్యాకు చెందిన వ్లాదిమిర్ పుతిన్, డోనాల్డ్ ట్రంప్ (యుఎస్), చైనాకు చెందిన జి జిన్పింగ్ వరుసగా 29.9%, 21.9%, మరియు 18.1% ఓట్లు సాధించారు.
రీడర్స్ పోల్లో 25 మందికి పైగా ప్రపంచ నాయకులను నామినేట్ చేయగా, నలుగురు అభ్యర్థులను చివరి రౌండ్కు నిపుణుల బృందం ఎంపిక చేసింది.
పోల్కు నామినేట్ అయిన వారందరిపై విస్తృతమైన అధ్యయనం తోపాటు పరిశోధనల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరిగింది. సాధారణ ఓటింగ్ విధానంలా కాకుండా , బ్రిటిష్ హెరాల్డ్ పాఠకులు తమ ఓటును ధృవీకరించడానికి తప్పనిసరి వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ప్రక్రియ ద్వారా ఓటు వేసేలా పోల్ నిర్వహించింది.
నమో అని కూడా పిలువబడే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ అగ్రశ్రేణి నాయకులలో ఒకరిగా పరిగణించబడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనాకు చెందిన జి జిన్పింగ్, వ్లాదిమిర్ పుతిన్లతో తన విజయవంతమైన అధికారిక విదేశీ పర్యటనలు మరియు సమావేశాల ద్వారా ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ నాయకుడిగా తన స్థాయిని పెంచుకున్నారు.
జూలైలో విడుదలకాబోయే బ్రిటిష్ హెరాల్డ్ మ్యాగజైన్ కవర్ పేజీలో పీఎం నరేంద్ర మోడీ ఫొటో ప్రదర్శించ బడుతుందని ప్రకటించింది. ఇది 15 జూలై 2019 న విడుదల అవుతుంది. బ్రిటిష్ హెరాల్డ్ మే-జూన్ సంచికలో జాకిందా ఆర్డెర్న్ మరియు మార్చి-ఏప్రిల్ సంచికలో వ్లాదిమిర్ పుతిన్ ఫొటోలను ప్రకటించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ట్రాఫిక్కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!
- కార్మికుల రక్షణకు కువైట్ కీలక చర్యలు..!!
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!







