వాహనదారులకు అత్యవసర సందేశాలను ప్రసారం చేయనున్న షార్జా పోలీసులు
- June 24, 2019వాహనదారులకు అత్యవసర సందేశాలను ప్రసారం చేయడానికి షార్జా పోలీసులు ఆదివారం కొత్త రేడియో ఆధారిత సేవను ప్రారంభించారు. ఈ సేవ అన్ని పోలీసు పెట్రోలింగ్లలో జూలై 1 నుండి లభ్యమవుతుంది.
సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ డాక్టర్ అహ్మద్ సయీద్ అల్ నౌర్ మాట్లాడుతూ, ఈ పరికరం రేడియో తరంగాల ద్వారా పరిసర వాహనాలకు వివిధ భాషలలో సందేశాలను పంపుతుంది. పెట్రోలింగ్కు/పెట్రోలింగ్ వాహనం వస్తున్నట్లు వాహనదారులకు తెలియజేస్తూ వారికి దారి ఇవ్వవలసిందిగా సూచిస్తుంది. దీనిద్వారా అతి తక్కువ సమయంలో ఎమెర్జెనీ ప్రదేశానికి పోలీసులు చేరుకోవచ్చని తెలిపారు.
ఈ పరికరంలో రికార్డ్ చేయబడిన మూడు ఆడియో క్లిప్లు కలిగి ఉంటాయి. వాటిని ఇలా వివరించారు డాక్టర్ అహ్మద్ సయీద్ అల్ నౌర్:
- మొదటి సందేశం వాహనదారులను సమీపించే పోలీసు లేదా అత్యవసర వాహనం ఉనికిని హెచ్చరిస్తుంది.
- రెండవది అత్యవసర లేదా పోలీసు వాహనం ముందు నిలిపి ఉంచినట్లు వారిని హెచ్చరిస్తుంది.
- మూడవది పోలీసు వాహనం జంక్షన్ కు చేరుకున్నప్పుడు వాహనదారులను ఆపమని అభ్యర్థిస్తుంది.
ఈ సందేశాలను పాటించి ప్రతి వాహనదారుడు పోలీసు, అత్యవసర మరియు అధికారిక కాన్వాయ్ వాహనాలకు దారి వదిలి, అధికారులకు మెరుగైన సేవ అందించేందుకు సహకరించవలసినదిగా కోరారు.
ఈ సందేశాలను ఖాతరు చేయక/అడ్డుకునే వాహదారులకు 3 వేల డాలర్ల జరిమానా విధించబడతారని, వారి వాహనాలను ఆరు ట్రాఫిక్ పాయింట్లతో పాటు 30 రోజుల పాటు నిర్బంధించనున్నట్లు బ్రిగ్ అల్ నౌర్ తెలిపారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత