సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా
- July 02, 2019
క్రికెట్ లో అరుదుగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అలాగే భారత్, బాంగ్లాదేశ్ ల మధ్య ఇవాళ జరిగిన మ్యాచ్ లో సరికొత్త సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ ఒకే కీపర్ లేదంటే ఎక్సట్రా వికెట్ కీపర్ తో బరిలోకి దిగే టీమిండియా ఇవాళ ఏకంగా నలుగురు కీపర్లతో మ్యాచ్ సాగించింది. రెగ్యులర్ కీపర్ ధోనీతో పాటుగా బ్యాట్స్మెన్ కోటాలో దినేశ్ కార్తీక్, రిషబ్పంత్, కేఎల్ రాహుల్ టీమ్లో చోటు దక్కించుకోవడం విశేషం. వీరు ముగ్గురు కూడా ప్రొఫెషనల్ వికెట్ కీపర్లే. అందరూ టీమిండియాకు కీపర్లుగా ప్రాతినిధ్యం వహించినవారే. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ జాదవ్ స్థానంలో…. సీనియర్ దినేష్ కార్తీక్కు చోటు లభించింది. అలాగే ధావన్ స్థానంలో రాహుల్ కు అవకాశం లభించింది. ఇవాళ జరిగిన మ్యాచ్ లో రాహుల్ చెలరేగిపోయాడు. కాగా భారత్ తరఫున ఏకంగా నలుగురు వికెట్ కీపర్లు ఉండటం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ మ్యాచ్ తో భారత జట్టు ఓ సరికొత్త రికార్డు సృష్టించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!