దుబాయ్‌ బస్‌ యాక్సిడెంట్‌: తప్పిదాన్ని ఒప్పుకున్న డ్రైవర్‌

- July 02, 2019 , by Maagulf
దుబాయ్‌ బస్‌ యాక్సిడెంట్‌: తప్పిదాన్ని ఒప్పుకున్న డ్రైవర్‌

ఒమన్‌ బస్‌ డ్రైవర్‌, బస్సు ప్రమాదానికి తప్పిదమే కారణమని ఒప్పుకున్నాడు. జూన్‌ 6న ఒమన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కి చెందిన మవసలాత్‌ బస్సు ప్రమాదానికి గురి కావడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. మృతుల్లో అత్యధికులు భారతదేశానికి చెందినవారే. తన తప్పిదం కారణంగానే బస్సు ప్రమాదానికి గురయ్యిందని విచారణలో నిందితుడు అంగీకరించడం జరిగింది. విచారణ గురించి అడ్వొకేట్‌ జనరల్‌ అలాగే ఎమిరేట్‌ ట్రాఫిక్‌ ప్రాసిక్యూషన్‌ హెడ్‌ సలాహ్‌ బో ఫర్రుచా అల్‌ ఫెలాసి మాట్లాడుతూ, 53 ఏళ్ళ డ్రైవర్‌, తన డ్రైవింగ్‌ కారణంగా బస్సు ప్రమాదానికి గురయ్యిందని ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ కేసు తదుపరి విచారణ జులై 9వ తేదీకి వాయిదా పడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com