దుబాయ్ బస్ యాక్సిడెంట్: తప్పిదాన్ని ఒప్పుకున్న డ్రైవర్
- July 02, 2019
ఒమన్ బస్ డ్రైవర్, బస్సు ప్రమాదానికి తప్పిదమే కారణమని ఒప్పుకున్నాడు. జూన్ 6న ఒమన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి చెందిన మవసలాత్ బస్సు ప్రమాదానికి గురి కావడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. మృతుల్లో అత్యధికులు భారతదేశానికి చెందినవారే. తన తప్పిదం కారణంగానే బస్సు ప్రమాదానికి గురయ్యిందని విచారణలో నిందితుడు అంగీకరించడం జరిగింది. విచారణ గురించి అడ్వొకేట్ జనరల్ అలాగే ఎమిరేట్ ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ హెడ్ సలాహ్ బో ఫర్రుచా అల్ ఫెలాసి మాట్లాడుతూ, 53 ఏళ్ళ డ్రైవర్, తన డ్రైవింగ్ కారణంగా బస్సు ప్రమాదానికి గురయ్యిందని ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ కేసు తదుపరి విచారణ జులై 9వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







