సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా
- July 02, 2019
క్రికెట్ లో అరుదుగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అలాగే భారత్, బాంగ్లాదేశ్ ల మధ్య ఇవాళ జరిగిన మ్యాచ్ లో సరికొత్త సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ ఒకే కీపర్ లేదంటే ఎక్సట్రా వికెట్ కీపర్ తో బరిలోకి దిగే టీమిండియా ఇవాళ ఏకంగా నలుగురు కీపర్లతో మ్యాచ్ సాగించింది. రెగ్యులర్ కీపర్ ధోనీతో పాటుగా బ్యాట్స్మెన్ కోటాలో దినేశ్ కార్తీక్, రిషబ్పంత్, కేఎల్ రాహుల్ టీమ్లో చోటు దక్కించుకోవడం విశేషం. వీరు ముగ్గురు కూడా ప్రొఫెషనల్ వికెట్ కీపర్లే. అందరూ టీమిండియాకు కీపర్లుగా ప్రాతినిధ్యం వహించినవారే. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ జాదవ్ స్థానంలో…. సీనియర్ దినేష్ కార్తీక్కు చోటు లభించింది. అలాగే ధావన్ స్థానంలో రాహుల్ కు అవకాశం లభించింది. ఇవాళ జరిగిన మ్యాచ్ లో రాహుల్ చెలరేగిపోయాడు. కాగా భారత్ తరఫున ఏకంగా నలుగురు వికెట్ కీపర్లు ఉండటం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ మ్యాచ్ తో భారత జట్టు ఓ సరికొత్త రికార్డు సృష్టించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







