ఇరాన్ నిర్ణయంపై చైనా విచారం
- July 02, 2019బీజింగ్: అణుఒప్పందంలో పొందుపర్చిన యురేనియం నిల్వల పరిమితిని దాటాలన్న ఇరాన్ నిర్ణయంపై చైనా విచారం వ్యక్తం చేసింది. అయితే ఈ ఉద్రిక్తతలన్నింటికీ మూలకారణం అమెరికా కొనసాగిస్తున్న అధికవత్తిడే నని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి గెంగ్షువావాంగ్ స్పష్టం చేశారు. అమెరికా కఠిన ఆంక్షల ప్రభావం నుండి తమ దేశాన్ని రక్షించేందుకు ఈ ఒప్పందంలో ఇతర భాగస్వాములైన బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాలు ముందుకు రాకపోతే తాము యురేనియం నిల్వల పరిమితిని అతిక్రమిస్తామని ఇరాన్ సోమవారం ప్రకటించింది. ఇరాన్ ప్రకటనపై స్పందించిన ట్రంప్ 'నిప్పుతో చెలగాటమాడుతోందం'టూ మండిపడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన చైనా విదేశాంగశాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం పట్ల చైనా విచారం వ్యక్తం చేస్తోందన్నారు. అయితే అదే సమయంలో ప్రస్తుత ఉద్రిక్తతలన్నింటికీ అమెరికా ఇరాన్పై కొనసాగిస్తున్న అత్యధికస్థాయి వత్తిడే ప్రధాన కారణమన్నది తమ నిశ్చితాభిప్రాయమని ఆయన చెప్పారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని అన్ని వర్గాలూ సంయమనంతో వ్యవహరించాలని, అణు ఒప్పంద స్ఫూర్తికి కట్టుబడి వ్యవహరించాలని తాము కోరుతున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్