బికె బిర్లా మృతికి సంతాపం తెలిపిన బిర్లా పబ్లిక్ స్కూల్
- July 09, 2019
దోహా: తమ ఫౌండర్ అలాగే ప్రముఖ ఫిలాంత్రపిస్ట్, ఇండస్ట్రియలిస్ట్ బికె బిర్లా మృతికి బిర్లా పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్, స్టాఫ్ మరియు స్టూడెంట్స్ ప్రగాఢ సంతాపం తెలిపారు. బికె బిర్లా పలు పుస్తకాల్ని కూడా రచించారు. 'స్వాంతా సుఖాయ' అనే ఆటోబయోగ్రపీని కూడా రచించారాయన. ప్రీ ఇండిపెండెన్స్, మహాత్మా గాంధీతో తనకున్న అనుబంధం సహా అనేక విషయాల్ని అందులో ఆయన పొందుపరిచారు. బికె బిర్లా పలు ఛారిటీ ట్రస్టులకు ఛైర్మన్గా వ్యవహరించారు. ఆ ట్రస్టుల ద్వారా ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్ళు నడుస్తున్నాయి. దోహాలో 2004లో బికె బిర్లా, బిర్లా పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేశారు. బిర్లా పబ్లిక్ స్కూల్ వైస్ ఛైర్మన్ గోపె సహాని, డైరెక్టర్ సివి రప్పాయ్, ప్రిన్సిపల్ ఎపి శర్మ తదితరులు బికె బిర్లా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







