బికె బిర్లా మృతికి సంతాపం తెలిపిన బిర్లా పబ్లిక్ స్కూల్
- July 09, 2019
దోహా: తమ ఫౌండర్ అలాగే ప్రముఖ ఫిలాంత్రపిస్ట్, ఇండస్ట్రియలిస్ట్ బికె బిర్లా మృతికి బిర్లా పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్, స్టాఫ్ మరియు స్టూడెంట్స్ ప్రగాఢ సంతాపం తెలిపారు. బికె బిర్లా పలు పుస్తకాల్ని కూడా రచించారు. 'స్వాంతా సుఖాయ' అనే ఆటోబయోగ్రపీని కూడా రచించారాయన. ప్రీ ఇండిపెండెన్స్, మహాత్మా గాంధీతో తనకున్న అనుబంధం సహా అనేక విషయాల్ని అందులో ఆయన పొందుపరిచారు. బికె బిర్లా పలు ఛారిటీ ట్రస్టులకు ఛైర్మన్గా వ్యవహరించారు. ఆ ట్రస్టుల ద్వారా ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్ళు నడుస్తున్నాయి. దోహాలో 2004లో బికె బిర్లా, బిర్లా పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేశారు. బిర్లా పబ్లిక్ స్కూల్ వైస్ ఛైర్మన్ గోపె సహాని, డైరెక్టర్ సివి రప్పాయ్, ప్రిన్సిపల్ ఎపి శర్మ తదితరులు బికె బిర్లా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







