టెర్రరిజం అభియోగాలు: 11 మందికి జైలు శిక్ష
- July 13, 2019
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్, 11 మంది బహ్రెయినీలకు జైలు శిక్ష విధించింది. తీవ్రవాదంతో సంబంధాలున్నాయనే ఆరోపణలతోపాటు, ఆయుధాల్ని, పేలుడు పదార్థాల్ని కలిగివున్నారన్న అభియోగాలూ వీరిపై మోపబడ్డాయని చీఫ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. వీరిలో ఐదుగురికి పదేళ్ళ జైలు శిక్షతోపాటు, ఒక్కొక్కరికీ 100,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష విధంచగా మరో ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఇంకో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించగా, ఐదుగురికి ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది న్యాయస్థానం. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విచారణలో నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ ఫోర్సెస్పై దాడికి నిందితులు యత్నించారు. సోషల్ మీడియా వేదికగా నిందితులు తీవ్రవాదాన్ని ప్రమోట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







