టెర్రరిజం అభియోగాలు: 11 మందికి జైలు శిక్ష
- July 13, 2019బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్, 11 మంది బహ్రెయినీలకు జైలు శిక్ష విధించింది. తీవ్రవాదంతో సంబంధాలున్నాయనే ఆరోపణలతోపాటు, ఆయుధాల్ని, పేలుడు పదార్థాల్ని కలిగివున్నారన్న అభియోగాలూ వీరిపై మోపబడ్డాయని చీఫ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. వీరిలో ఐదుగురికి పదేళ్ళ జైలు శిక్షతోపాటు, ఒక్కొక్కరికీ 100,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష విధంచగా మరో ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఇంకో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించగా, ఐదుగురికి ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది న్యాయస్థానం. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విచారణలో నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ ఫోర్సెస్పై దాడికి నిందితులు యత్నించారు. సోషల్ మీడియా వేదికగా నిందితులు తీవ్రవాదాన్ని ప్రమోట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్