దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విద్యుత్ సమస్య
- July 16, 2019దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్కి చెందిన మూడో టెర్మినల్లో 30 నిమిషాల పాటు విద్యుత్ సమస్య తలెత్తింది. అయితే, ఈ సమస్య కారణంగా ఎయిర్పోర్ట్ ఆపరేషన్కి ఎలాంటి సమస్యలూ రాలేదు. ఉదయం 11.04 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ అధికార ప్రతినిథి వెల్లడించారు. 30 నిమిషాల్లోనే సమస్యను సరిదిద్దామని చెప్పారు. అయితే, ఏసీ యూనిట్స్ షట్ డౌన్ అవడంతో పలువురు ప్రయాణీకులు తీవ్ర సమస్యల్ని ఎదుర్కొన్నారు. 1960లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. సుమారు 88.2 మిలియన్ ప్రయాణీకులు ఏడాదిలో ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తుంటారు. 100 ఎయిర్ లైన్స్ ప్రపంచ వ్యాప్తంగా 240 డెస్టినేషన్స్కి తమ సేవల్ని అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!