విదేశాలకు వెళ్లేందుకు కొత్త టెక్నాలజీ వస్తుందోచ్..!
- July 17, 2019
విమానంలో విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్పోర్టు ఉండాల్సిందే. అయితే భవిష్యత్తులో పాస్పోర్టు లేకుండానే ప్రయాణించొచ్చట. ఇందుకోసం ప్రణాళికలు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం.
నోన్ ట్రావెలర్ డిజిటల్ ఐడెంటిటీ (KTDI)ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు పాస్పోర్టులు లేకుండా విమానాల్లో విదేశాలకు వెళ్లొచ్చట. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీము పనులు జరుగుతున్నాయి. ముందుగా కెనడా నుంచి నెదర్లాండ్స్కు పాస్పోర్టు లేకుండా ప్రయాణికులను పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రయాణికుల దగ్గర ఒక మొబైల్ ఫోను ఉంటే చాలని చెబుతోంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. విదేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలోనే విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిపోతోంది. అందుకే KTDI పద్ధతి ద్వారా అక్రమమార్గాల్లో విదేశాలకు వెళ్లే వారికి చెక్ పెట్టాలని భావిస్తోంది.
2030 నాటికి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారి సంఖ్య 1.8 బిలియన్కు చేరుకోనుందని, వీరందరినీ చెక్ చేసి పంపించడం కష్టతరం అయిపోతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధి క్రిస్టోఫ్ వుల్ఫ్ చెబుతున్నారు. ఇందుకోసమే KTDI టెక్నాలజీని వినియోగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ సేవలు అనుకున్న ఫలితాన్ని ఇస్తే ఇక భవిష్యత్తులో పాస్పోర్టు ఇతర పేపర్ వర్క్ అవసరం ఉండదని చెబుతున్నారు. 2019 సంవత్సరమంతా ఈ ప్రయోగాలు కొనసాగుతాయని 2020లో తొలిసారిగా డిజిటల్ డాక్యుమెంట్లతో తొలి ప్రయాణం జరుగుతుంది. ఈ స్కీమ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆయా దేశ ప్రభుత్వాలపై ఏవియేషన్ సంస్థలపై ఆధారపడి ఉంటుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







