జింబాబ్వే క్రికెట్ జట్టును సస్పెండ్ చేసిన ఐసీసీ..
- July 19, 2019ఒకప్పుడు అత్యుత్తమ క్రికెట్ జట్లలో ఒక్కటిగా ఉన్న జింబాబ్వే కాలక్రమేణ ఉనికే ప్రశ్నార్ధకంగా మార్చుకుంది . మూలిగే నక్కపై తాటి కాయ పడినట్టు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) జింబాబ్వే క్రికెట్ జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. ఆ జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. జింబాబ్వే ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సస్పెన్షన్ వెంటనే అమలులోకి వస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటినుంచి ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీల్లో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ టోర్నీల్లో పాల్గొనడానికి వీలులేదు. అలాగే జింబాబ్వే క్రికెట్కు అందిస్తున్న నిధుల సాయాన్ని కూడా ఐసీసీ పూర్తిగా నిలిపివేసింది. కీలక ఆటగాళ్ళతో మేటి జట్లను సైతం మట్టికరిపించిన జింబాబ్వే వరల్డ్ క్లాస్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆండీ పైక్రాఫ్ట్, ఆండీ ఫ్లవర్, ఎడ్డో బ్రాండెస్,క్రెయిగ్ ఎవాన్స్ లాంటి మేటి ఆటగాళ్ళు ఆ జట్టు నుంచి ప్రాతినిద్యం వహించారు. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఆ క్రికెట్ జట్టుపై కూడా పడడంతో క్రమంగా ప్రభను కోల్పోయింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు