ఐఎంఎ జ్యువల్స్ యజమాని మహ్మద్ మన్సూర్ ఖాన్ను అరెస్టు చేసిన ED
- July 20, 2019బెంగళూరు: వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ఐఎంఏ జ్యువెల్లరీ యజమాని మహమ్మద్ మన్సూర్ ఖాన్ అరెస్టయ్యారు. దుబాయ్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్న ఆయనను ఎయిర్పోర్టులోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినట్లు సిట్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఖాన్ను ఢిల్లీలోనే ఈడీ విచారిస్తోంది. దుబాయ్లో తలదాచుకున్న మన్సూర్ భారత్కి వచ్చి, కోర్టులో లొంగిపోవడానికి దర్యాప్తు సంస్థలు ఒప్పించినట్లు సిట్ అధికారులు తెలిపారు. అధిక వడ్డీలు ఇస్తామనీ, తమ కంపెన్లీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఐఎంఏ గ్రూప్ ద్వారా దాదాపు లక్ష మంది నుంచి మొత్తంగా రూ. 4,084 కోట్లను మన్సూర్ వసూలు చేశాడు. తర్వాత తాను తీవ్రంగా నష్టపోయాననీ, ఆత్మహత్యే శరణ్యమని ఒక ఆడియో టేప్ను జూన్ మొదటివారంలో విడుదల చేసి అదృశ్యమయ్యారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ