ఏపీ ప్రభుత్వానికి మరో షాక్..
- July 23, 2019
ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమంటూ ఏఐఐబీ తేల్చి చెప్పింది. అమరావతి అభివృద్ధికి రుణసాయం చేయలేమని ప్రపంచ బ్యాంక్ నిరాకరించిన వారం రోజులు గడవకముందే ఇప్పుడు మరో బ్యాంక్ వెనుకడుగు వేసింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమంటూ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఓ న్యూస్ ఏజెన్సీకి పంపిన ఈ మెయిల్లో AIIB ప్రతినిధి ఈ విషయాన్ని తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ సుముఖత వ్యక్తం చేసింది. ప్రపంచ బ్యాంకు రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకున్న వారం రోజుల్లోనే ఏఐఐబీ కూడా రుణసాయంపై వెనక్కి తగ్గడం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









