పరిమితి కాలానికి ప్రత్యేక రాయితీను ప్రకటించిన ఎమరేట్స్
- January 06, 2016
ఒక పరిమిత సమయం వరకు ప్రయాణికుల , వ్యాపార , ఆర్ధిక తరగతి విమాన ప్రయాణానికి ప్రత్యేక రాయితీను ఎమరేట్స్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ విమాన టికెట్ బుకింగ్ జనవరి 18వ తేదీ వరకు ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 18వ తేదీ లోపు ప్రయాణించేవారికి ఈ బుకింగ్ వ్యవధి వర్తిస్తుంది. దుబాయ్ నుంచి మధ్య తూర్పు మరియు ఆసియా గమ్యస్థానాలకు 650 దినార్లతో ప్రయాణించవచ్చు. మస్కట్ నుంచి కరాచికు 935 దినార్లు , దుబాయ్ నుంచి ముంబైకు 1025 దినార్లు, దుబాయ్ నుంచి మనీలకు 2,205 దినార్లు, దుబాయ్ నుంచి కౌలాలంపూర్ కు 2,245 దినార్లు విమాన ప్రయణానికి ఖర్ఛు కానుంది. అలాగే, యూరోప్ దేశాలకు ప్రత్యేక రాయితీ ఈ విధంగా ఉంది .దుబాయ్ నుంచి మ్యూనిచ్ కు 2,625 దినార్లు, దుబాయ్ నుంచి బార్సిలోనా కు 2,815 దినార్లు , దుబాయ్ నుంచి పారిస్ కు 3,695 దినార్లు, దుబాయ్ నుంచి నార్త్ సెంట్రల్ అమేరికా నగరాలకు , లాస్ ఏంజెల్స్ కు 4,945 దినార్లు, పనామా నగరానికి 6,345 దినార్లుగా ఉందని ఎమరేట్స్ ఎగ్జీక్వుటేవ్ ఉప అధ్యక్షుడు తిఎర్రి అన్తినోరి తెలిపారు. 2016 లో జరిగే అన్ని ప్రయాణాలు ఈ ప్రత్యేక రాయితీ కాలంలో వేగం పునజుకొనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







