పరిమితి కాలానికి ప్రత్యేక రాయితీను ప్రకటించిన ఎమరేట్స్

- January 06, 2016 , by Maagulf
పరిమితి కాలానికి ప్రత్యేక రాయితీను ప్రకటించిన ఎమరేట్స్

ఒక పరిమిత సమయం వరకు ప్రయాణికుల , వ్యాపార , ఆర్ధిక తరగతి విమాన ప్రయాణానికి ప్రత్యేక రాయితీను ఎమరేట్స్  ఎయిర్ లైన్స్ ప్రకటించింది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ విమాన టికెట్ బుకింగ్ జనవరి 18వ తేదీ వరకు ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 18వ తేదీ లోపు ప్రయాణించేవారికి ఈ బుకింగ్ వ్యవధి వర్తిస్తుంది. దుబాయ్ నుంచి మధ్య తూర్పు మరియు ఆసియా గమ్యస్థానాలకు 650 దినార్లతో ప్రయాణించవచ్చు. మస్కట్ నుంచి కరాచికు 935 దినార్లు , దుబాయ్ నుంచి ముంబైకు 1025 దినార్లు, దుబాయ్ నుంచి మనీలకు 2,205 దినార్లు, దుబాయ్ నుంచి కౌలాలంపూర్ కు 2,245 దినార్లు విమాన ప్రయణానికి ఖర్ఛు కానుంది.  అలాగే, యూరోప్ దేశాలకు ప్రత్యేక రాయితీ ఈ విధంగా ఉంది .దుబాయ్ నుంచి మ్యూనిచ్ కు 2,625 దినార్లు, దుబాయ్ నుంచి బార్సిలోనా కు 2,815 దినార్లు ,   దుబాయ్ నుంచి పారిస్ కు 3,695 దినార్లు, దుబాయ్ నుంచి నార్త్ సెంట్రల్ అమేరికా నగరాలకు , లాస్  ఏంజెల్స్ కు 4,945 దినార్లు, పనామా నగరానికి 6,345 దినార్లుగా ఉందని  ఎమరేట్స్  ఎగ్జీక్వుటేవ్ ఉప అధ్యక్షుడు తిఎర్రి అన్తినోరి తెలిపారు. 2016 లో జరిగే అన్ని ప్రయాణాలు ఈ ప్రత్యేక రాయితీ కాలంలో వేగం పునజుకొనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com