ఫీజ్ పెంచడంలేదన్న డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్
- January 06, 2016
ఇంధన ధరల్లో పెరుగుదల కారణంగా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు ఫీజు పెంచుతున్నారనే వార్తలు రాగా, ఆ వార్తల్లో నిజం లేదని డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు వెల్లడించారు. పెరుగుదల చాలా తక్కువగా ఉండటంతోనే ఫీజు పెంచడంలేదని ఓ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ చెప్పారు. అయితే భవిష్యత్తులో ఇంధన ధరలు ఇంకా పెరిగితే, అప్పుడు ఫీజు పెంచక తప్పదని ఆయన అన్నారు. ఇన్స్ట్రక్టర్స్ అందరం కలసి కట్టుగా ఫీజు పెంపకపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారాయన. గంట సమయానికి లెర్నర్స్ 6 నుంచి 8 ఒమన్ రియాల్స్ వరకూ చెల్లిస్తారనీ, ఛార్జీలు పెంచవలసి వస్తే దాన్ని 10 ఒమన్ రియాల్స్ చేయవలసి ఉంటుందన్న ఆయన, అలా పెంచడం ద్వారా ట్రైనీలపై భారం పెరుగుతుందనీ, తద్వారా లైసెన్స్ పొందడం భారమవుతుందని చెబుతూ పలు కారణాలతో ప్రస్తుతానికి ఫీజు పెంపకం ఆలోచనలకే పరిమితమయ్యిందని వివరించారు. ఇంధన ధరల పెంపుతో అన్ని విభాగాల్లోనూ ఛార్జీల మోత మోగనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







