ఫీజ్ పెంచడంలేదన్న డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్
- January 06, 2016
ఇంధన ధరల్లో పెరుగుదల కారణంగా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు ఫీజు పెంచుతున్నారనే వార్తలు రాగా, ఆ వార్తల్లో నిజం లేదని డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు వెల్లడించారు. పెరుగుదల చాలా తక్కువగా ఉండటంతోనే ఫీజు పెంచడంలేదని ఓ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ చెప్పారు. అయితే భవిష్యత్తులో ఇంధన ధరలు ఇంకా పెరిగితే, అప్పుడు ఫీజు పెంచక తప్పదని ఆయన అన్నారు. ఇన్స్ట్రక్టర్స్ అందరం కలసి కట్టుగా ఫీజు పెంపకపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారాయన. గంట సమయానికి లెర్నర్స్ 6 నుంచి 8 ఒమన్ రియాల్స్ వరకూ చెల్లిస్తారనీ, ఛార్జీలు పెంచవలసి వస్తే దాన్ని 10 ఒమన్ రియాల్స్ చేయవలసి ఉంటుందన్న ఆయన, అలా పెంచడం ద్వారా ట్రైనీలపై భారం పెరుగుతుందనీ, తద్వారా లైసెన్స్ పొందడం భారమవుతుందని చెబుతూ పలు కారణాలతో ప్రస్తుతానికి ఫీజు పెంపకం ఆలోచనలకే పరిమితమయ్యిందని వివరించారు. ఇంధన ధరల పెంపుతో అన్ని విభాగాల్లోనూ ఛార్జీల మోత మోగనుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









