వాల్మార్ట్ స్టోర్ లో కాల్పులు, 20 మంది మృతి
- August 04, 2019
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ నగరంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
వాల్మార్ట్ స్టోర్లోకి గుర్తు తెలియని వ్యక్తి శనివారం అర్ధరాత్రి జొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో ఈ ఘటనలో గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయాన్ని టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ మీడియాకు చెప్పారు. సాయుధుడైన నిందితుడు స్టోర్స్ లో జొరబడి కాల్పులకు దిగినట్టుగా ప్రత్యక్షసాక్షులుతెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సాయుధులు కాల్పులు జరుపుతున్న సమయంలో ప్రాణాలు దక్కించుకొనేందుకు భయంతో పరుగులు తీస్తున్నట్టుగా ఆ దృశ్యాల్లో కన్పిస్తున్నాయి. అందిన సమాచారం మేరకు ఈ ఘటనలో 20 మంది మృతి చెందితే, మరో 26 మంది తీవ్రంగా గాయపడినట్టుగా స్థానిక అధికారులు ప్రకటించారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు రక్తం ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని ఆసుపత్రి వర్గాలు కోరాయి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







