ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాక్ ప్రధాని
- August 06, 2019ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంట్లో రగడ చోటుచేసుకుంది. కశ్మీర్ అంశంపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశాలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరుకాలేదు. ప్రధాని గైర్హాజరుపై ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. విపక్షం నిరసనతో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో స్పీకర్ కూడా తన ఛాంబర్ నుంచి వెళ్లిపోయారు. సమావేశాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి.
కశ్మీర్పై భారత్ తీసుకున్న నిర్ణయం ఐక్య రాజ్య సమితి తీర్మానాలకు వ్యతిరేకమంటూ పాకిస్తాన్ విమర్శనాస్త్రాలను అందుకున్నా.. ఇస్లామిక్ దేశాల సమాఖ్య (ఓఐసీ) మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. మలేసియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ స్వయంగా ఫోన్లో మాట్లాడినా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పాక్కు అత్యంత మిత్రదేశమైన చైనా కూడా ప్రకటనలకు దూరంగా ఉంది. దీంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు.
తాజా వార్తలు
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు