ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాక్ ప్రధాని
- August 06, 2019
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంట్లో రగడ చోటుచేసుకుంది. కశ్మీర్ అంశంపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశాలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరుకాలేదు. ప్రధాని గైర్హాజరుపై ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. విపక్షం నిరసనతో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో స్పీకర్ కూడా తన ఛాంబర్ నుంచి వెళ్లిపోయారు. సమావేశాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి.
కశ్మీర్పై భారత్ తీసుకున్న నిర్ణయం ఐక్య రాజ్య సమితి తీర్మానాలకు వ్యతిరేకమంటూ పాకిస్తాన్ విమర్శనాస్త్రాలను అందుకున్నా.. ఇస్లామిక్ దేశాల సమాఖ్య (ఓఐసీ) మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. మలేసియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ స్వయంగా ఫోన్లో మాట్లాడినా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పాక్కు అత్యంత మిత్రదేశమైన చైనా కూడా ప్రకటనలకు దూరంగా ఉంది. దీంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!