ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాక్ ప్రధాని

- August 06, 2019 , by Maagulf
ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాక్ ప్రధాని

ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంట్‌లో రగడ చోటుచేసుకుంది. కశ్మీర్ అంశంపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశాలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరుకాలేదు. ప్రధాని గైర్హాజరుపై ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. విపక్షం నిరసనతో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో స్పీకర్ కూడా తన ఛాంబర్ నుంచి వెళ్లిపోయారు. సమావేశాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి.

కశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయం ఐక్య రాజ్య సమితి తీర్మానాలకు వ్యతిరేకమంటూ పాకిస్తాన్ విమర్శనాస్త్రాలను అందుకున్నా.. ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య (ఓఐసీ) మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. మలేసియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్వయంగా ఫోన్‌లో మాట్లాడినా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పాక్‌కు అత్యంత మిత్రదేశమైన చైనా కూడా ప్రకటనలకు దూరంగా ఉంది. దీంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com