సుష్మా స్వరాజ్కి బహ్రెయిన్లో ఘన నివాళి
- August 08, 2019
బహ్రెయిన్ కింగ్డమ్లో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సంతాప సమావేశాల్లో దివంగత నేత సుష్మా స్వరాజ్కి ఘన నివాళులు అర్పించారు. గుండె పోటుతో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మృతి చెందిన విషయం విదితమే. ఇండియన్ అంబాసిడర్ అలోక్కుమార్ సిన్హా, సుష్మా స్వరాజ్ సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు. బహ్రెయిన్ - భారత్ మధ్య సంబంధాల మెరుగు కోసం ఆమె ఎంతో కృషి చేశారని చెప్పారు. సీఫ్లోని ఇండియన్ ఎంబసీ కాంప్లెక్స్లో ఈ సంతాప సభ జరిగింది. వేదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బహ్రెయిన్లో పలుమార్లు ఆమె పర్యటించారనీ, చివరిసారిగా 2018లో ఆమె బహ్రెయిన్లో పర్యటించి న్యూ ఎంబసీ కాంప్లెక్స్ని ప్రారంభించారని చెప్పారు. బహ్రెయిన్లోని భారత పౌరులంతా సుష్మా స్వరాజ్ సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని సిన్హా వివరించారు. ఇండియన్ క్లబ్ అలాగే బహ్రెయిన్ కేరళీయ సమాజంలో కూడా సుష్మా స్వరాజ్ మృతి నేపథ్యంలో సంతాప సమావేశాలు జరిగాయి.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









