సుష్మా స్వరాజ్కి బహ్రెయిన్లో ఘన నివాళి
- August 08, 2019
బహ్రెయిన్ కింగ్డమ్లో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సంతాప సమావేశాల్లో దివంగత నేత సుష్మా స్వరాజ్కి ఘన నివాళులు అర్పించారు. గుండె పోటుతో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మృతి చెందిన విషయం విదితమే. ఇండియన్ అంబాసిడర్ అలోక్కుమార్ సిన్హా, సుష్మా స్వరాజ్ సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు. బహ్రెయిన్ - భారత్ మధ్య సంబంధాల మెరుగు కోసం ఆమె ఎంతో కృషి చేశారని చెప్పారు. సీఫ్లోని ఇండియన్ ఎంబసీ కాంప్లెక్స్లో ఈ సంతాప సభ జరిగింది. వేదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బహ్రెయిన్లో పలుమార్లు ఆమె పర్యటించారనీ, చివరిసారిగా 2018లో ఆమె బహ్రెయిన్లో పర్యటించి న్యూ ఎంబసీ కాంప్లెక్స్ని ప్రారంభించారని చెప్పారు. బహ్రెయిన్లోని భారత పౌరులంతా సుష్మా స్వరాజ్ సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని సిన్హా వివరించారు. ఇండియన్ క్లబ్ అలాగే బహ్రెయిన్ కేరళీయ సమాజంలో కూడా సుష్మా స్వరాజ్ మృతి నేపథ్యంలో సంతాప సమావేశాలు జరిగాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







