హజ్ కోసం సౌదీ చేరుకున్న 1.8 మిలియన్ మంది ఫిలిగ్రిమ్స్
- August 08, 2019
జెడ్డా: 1.8 మిలియన్ల మందికి పైగా హజ్ ఫిలిగ్రిమ్స్ సౌదీ అరేబియా చేరుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ హజ్ ఎరైవల్స్ సోమవారంతో ముగిశాయి. కాగా, బుధవారం ఉదయం చివరి బ్యాచ్ ఫిలిగ్రిమ్స్ ట్యునీషియా నుంచి మక్కా రూట్ ద్వారా సౌదీకి చేరుకున్నారు. మక్కా రూట్ ఇనీషియేటివ్ ద్వారా వచ్చే ప్రయాణీకులు హెల్త్, వీసా మరియు ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ని తమ తమ దేశాల్లో పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. తద్వారా మక్కా మరియు మదీనాలోకి సీమ్లెస్ ట్రాన్స్పోర్ట్ అవడానికి వీలు కలుగుతుంది. 171,000 మంది యాత్రీకులు ట్యునీషియా, మలేసియా, ఇండోనేసియా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి ఈ ఇనీషియేటివ్ ద్వారా లబ్ది పొందారు. కాగా, మొత్తం 1,725,455 మంది ప్రయాణీకులు సౌదీ అరేబియాకి వచ్చారనీ, వీరిలో 95,634 మంది వాయు మార్గంలో, 17,250 మంది జల మార్గంలో వచ్చారు. ఈ ఏడాది 2.5 మిలియన్ల మందికి పైగా హజ్ ఫిలిగ్రిమ్స్ పవిత్ర ప్రార్థనల్ని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







