అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై ఎయిమ్స్ పత్రికా ప్రకటన
- August 10, 2019
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. అరుణ్ జైట్లీ శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దీనికి సంబంధించి వైద్యులు ప్రకటన విడుదల చేశారు. 'అరుణ్ జైట్లీ ఈ రోజు ఉదయం ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. వివిధ రంగాల నిపుణులైన వైద్యుల బృందం అరుణ్ జైట్లీ చికిత్సను పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆయన అరోగ్యం బాగానే ఉంది.' అని ఎయిమ్స్ ప్రకటనలో తెలిపింది. ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, స్పీకర్ ఓంబిర్లా తదితరులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ