భారత దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు
- August 10, 2019భారత దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ .. ఇక్కడ అని లేకుండా ప్రతి రాష్టాన్ని వర్షాలు ముంచెత్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో వరుణుడు భీభత్సం సృష్టిస్తున్నాడు. కర్ణాటక,కేరళ, తెలంగాణ, ఏపీ రాష్ఱ్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి,కృష్ణ ,కావేరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్నా భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. భారీ వరదల కారణంగా 25 మంది మృతి . వర్షం కారణంగా కొచ్చి విమానశ్రయాన్ని కూడా ముసివేశారు. అలాగే కర్నాటకలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ఱ్రాలోని అన్ని జలశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. డ్యామ్లు పూర్తి స్థాయిలో నింది ప్రమాదరస్థాయికి చేరుకున్నాయి. అక్కడి వరద బీభత్సానికి అద్దం పట్టేలా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బైక్పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు కాలువలో కొట్టుకుపోతున్న దృశ్యాలు ఆ ర్రాష్ట్రంపై వరుణుడు ఎంతటి ప్రతాపాన్ని చూపిస్తున్నాడో తెలియజేస్తుంది. కొడగు జిల్లా కొరంగల్లో మట్టిరోడ్డుపై ఉన్న చిన్నపాటి వంతెన కింద నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ సమయంలో ఆ వంతెనపై నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెళ్లేందుకు ప్రయత్నించారు. సరిగ్గా ఆ వారు వంతెన దాటుతున్న సమయంలోనే మట్టిరోడ్డుతో ఉన్న వంతెన తెగింది. దీంతో బైక్తో సహా ఆ ఇద్దరూ వరద నీటిలో కొట్టుకుపోయారు. అయితే వాళ్ళు ఏమయ్యారు అనే విషయం ఇప్పటివరకు తెలియలేదు. బయటకు వచ్చారా? లేదా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్