తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ప్రొ.జయశంకర్ సార్ జయంతి వేడుకలు
- August 10, 2019
ఖతార్:తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహ ఖతార్ లో ప్రొ.జయశంకర్ సార్ జయంతి వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు సందర్భంగా జాగృతి కార్యవర్గ సభ్యులు హాజరై ప్రో. జయశంకర్ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్నా గారు మాట్లాడుతూ..
సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చని సార్ జీవితం మనకు తెలియజేస్తుందని అన్నారు. వారి మాటలను ముందుతరాలకు తెలియజేస్తూ వారికి మార్గం చూపే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.ఉపాధ్యక్షుడు శశాంక్ అల్లకొండ గారు మాట్లాడుతూ పుట్టుక నీది చావు నీది నడుమ జీవితమంతా తెలంగాణది ఈ నినాదాన్ని నమ్మి ఆచరించిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు.తెలంగాణ జాగృతి నాయకులు శేఖర్ చిలువేరి , ఎల్లయ్య తాళ్లపెళ్లి, నవీన్ అళ్లే ,మహేందర్ మరియు రమేశ్ పిట్ల తదితర నాయకులు హాజరై జయశంకర్ సార్ను స్మరించుకుంటూ వారు లేని లోటును పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
----రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి-ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







