తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ప్రొ.జయశంకర్ సార్ జయంతి వేడుకలు
- August 10, 2019
ఖతార్:తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహ ఖతార్ లో ప్రొ.జయశంకర్ సార్ జయంతి వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు సందర్భంగా జాగృతి కార్యవర్గ సభ్యులు హాజరై ప్రో. జయశంకర్ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్నా గారు మాట్లాడుతూ..
సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చని సార్ జీవితం మనకు తెలియజేస్తుందని అన్నారు. వారి మాటలను ముందుతరాలకు తెలియజేస్తూ వారికి మార్గం చూపే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.ఉపాధ్యక్షుడు శశాంక్ అల్లకొండ గారు మాట్లాడుతూ పుట్టుక నీది చావు నీది నడుమ జీవితమంతా తెలంగాణది ఈ నినాదాన్ని నమ్మి ఆచరించిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు.తెలంగాణ జాగృతి నాయకులు శేఖర్ చిలువేరి , ఎల్లయ్య తాళ్లపెళ్లి, నవీన్ అళ్లే ,మహేందర్ మరియు రమేశ్ పిట్ల తదితర నాయకులు హాజరై జయశంకర్ సార్ను స్మరించుకుంటూ వారు లేని లోటును పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
----రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి-ఖతార్)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!