తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ప్రొ.జయశంకర్ సార్ జయంతి వేడుకలు
- August 10, 2019ఖతార్:తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహ ఖతార్ లో ప్రొ.జయశంకర్ సార్ జయంతి వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు సందర్భంగా జాగృతి కార్యవర్గ సభ్యులు హాజరై ప్రో. జయశంకర్ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్నా గారు మాట్లాడుతూ..
సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చని సార్ జీవితం మనకు తెలియజేస్తుందని అన్నారు. వారి మాటలను ముందుతరాలకు తెలియజేస్తూ వారికి మార్గం చూపే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.ఉపాధ్యక్షుడు శశాంక్ అల్లకొండ గారు మాట్లాడుతూ పుట్టుక నీది చావు నీది నడుమ జీవితమంతా తెలంగాణది ఈ నినాదాన్ని నమ్మి ఆచరించిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు.తెలంగాణ జాగృతి నాయకులు శేఖర్ చిలువేరి , ఎల్లయ్య తాళ్లపెళ్లి, నవీన్ అళ్లే ,మహేందర్ మరియు రమేశ్ పిట్ల తదితర నాయకులు హాజరై జయశంకర్ సార్ను స్మరించుకుంటూ వారు లేని లోటును పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
----రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి-ఖతార్)
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా