జి-7 సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా మోదీ

- August 25, 2019 , by Maagulf
జి-7 సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా మోదీ

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జి-7 సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొంటారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు సమాచారం. భారత్‌లో అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని, తమ వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని ట్రంప్‌ కోరనున్నట్టు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ సందర్భంగా తమిద్దరి మధ్య ఆర్టికల్ 370రద్దు గురించిన ప్రస్తావన వచ్చే అవకాశముందని ఇటీవల ట్రంప్ అన్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com