తీరం వెంబడి హై అలెర్ట్ ప్రకటించిన భారత నేవీ
- August 25, 2019లష్కరే తొయిబాకు చెందినట్లుగా అనుమానిస్తున్న ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో భారత నేవి అలర్ట్ అయ్యింది. తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించింది. కోయంబత్తూరులో హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో తీవ్రవాదులు చొరబడి ఉంటారనే నిఘా వర్గాల హెచ్చరికల మేరకు తమిళనాడులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కోయంబత్తూరులో తీవ్రవాదులు చొరబడినట్టు వచ్చిన వార్తలతో అప్రమత్తమైన పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. ప్రముఖ ఆలయాలు, మసీదు, చర్చిలలో బాంబుస్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. కోయంబత్తూరులోని ప్రధాన కూడళ్లలో భారీస్థాయిలో బలగాలను మోహరించిన పోలీసు యంత్రాంగం నగరంతో పాటు శివారు ప్రాంతాల్ని కూడా జల్లెడ పడుతోంది. ప్రజలు ఆందోళన చెందవద్దని అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పాకిస్తాన్, శ్రీలంకకు చెందిన ఆరుగురు తీవ్రవాదులు తమిళనాడులోకి చొరబడి ఉంటారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
మరోవైపు గుజరాత్ సముద్ర తీరంలో పాకిస్థాన్కు చెందిన రెండు పడవలు కనిపించాయి. కచ్ జిల్లా హరామి నాలా ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మత్స్యకార పడవలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పడవల్లో అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోయినా లోతైన దర్యాప్తు నిర్వహించాలని భద్రతా బలగాలు నిర్ణయించాయి.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు